నోటు పుస్తకాల వితరణ

Published: Tuesday September 28, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : సెప్టెంబల్ బోనకల్లు మండలం లోని నారాయణపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు, పాఠశాల ఫౌండేషన్ అమెరికా వారు 10000 రూపాయల విలువైన నోటు పుస్తకాలును అందించారు. ఈ నోటు పుస్తకాలు ను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ఆదివారం అందించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు  నోటు పుస్తకాలను అందించిన పాఠశాల ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. పాఠశాల ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు నోటు పుస్తకాలును పాఠశాల ఫౌండేషన్ అమెరికా ద్వారా అందించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫౌండేషన్ భాద్యులు కళ్యాణపు సాంబశివరావు, మాధినేని నరసింహా రావు, వాసిరెడ్డి రాoమ్మోహన్ రావు, వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్ పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు గోసు శ్రీనివాస్, వాసంశెట్టి అంజయ్య పాల్గొన్నారు