ఇంటర్ లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

Published: Saturday July 09, 2022
కోరుట్ల, జూలై 08 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తమ స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులను సన్మానించి అభినందించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.అనంతరం కాలేజ్ లైబ్రరీనీ సందర్శించి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ప్రిన్సిపల్ సంగీత మాధురి , మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్ , వైస్ చైర్మన్ గడ్డమీద పవన్, ఎంపీపీ తోట నారాయణ, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్, మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్, స్థానిక కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, ఇతర కౌన్సిలర్లు సర్పంచ్లు, టిఆర్ఎస్ యూత్ నాయకులు, మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ సిబ్బంది తదిరులు పాల్గొన్నారు.