సిపిఎం పార్టీ మధిర మండల కమిటీ కార్యదర్శి మందా సైదులు ఏకగ్రీవంగా ఎన్నిక

Published: Thursday October 07, 2021
మధిర, అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం అంరాయపట్నం గ్రామంలో సిపిఎం పార్టీ మండల రూరల్ ఏడవ మహాసభ జరిగింది ఈ మహాసభలో గత నాలుగు సంవత్సరాల కాలంగా పార్టీ చేసిన కృషిని నెమరు వేసుకుని భవిష్యత్ కాలంలో పార్టీని ముందుకు తీసుకుపోవడం కోసం నూతన మండల కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది ఆ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మంద సైదులు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికైన సైదులు కు పలువురు అభినందనలు తెలియజేశారు గత నాలుగు సంవత్సరాల కాలంలో పార్టీని అననుకూల పరిస్థితుల నుండి విలువైన పోరాటాలు నిర్వహించి పార్టీ ప్రతిష్ఠను పెంచేందుకు పార్టీ మండల కమిటీ ఐక్యంగా పనిచేసి ఫలితంగా గతం కంటే పార్టీ ప్రతిష్ట ప్రజా పునాది మెరుగుపడిందని మహాసభలో చర్చల ద్వారా వ్యక్తం అయిందని తెలిపారు మండల కమిటీలో సభ్యులుగా మద్దాల ప్రభాకర్ ఓట్ల శంకర్రావు నాయుడు శ్రీరాములు తో పాటు కొత్త సభ్యులుగా దొంతి వీరాచారి తేజావత్ నాగేశ్వరరావు చేగొండి వెంకాయమ్మ మరియు 14 మందితో నూతన కమిటీ ఎన్నిక జరిగింది.