*విద్యలో రాణిస్తేనే బంగారు భవిష్యత్
Published: Tuesday August 02, 2022
గ్రామీణ విద్యార్థులు విద్యలో రాణించి ఉజ్వల భవిష్యత్కు పునాదులు వేసుకోవాలని సీనియర్ జర్నలిస్టు కాళ్ల లింగస్వామి సూచించారు. మంచాల మండలం అస్మత్పూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తన తండ్రి కాళ్ల పోచయ్య జ్ఞాపకార్థం నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ తాను అక్షరాలు నేర్చిన పాఠశాలలోని విద్యార్థులకు చేయూతనందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు దాతల సహాయాన్ని అందిపుచ్చుకొని విద్యలో రాణించాలని, ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని భవిష్యత్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు రాజేందర్రెడ్డి, శ్రీను, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: