వైఎస్సార్ టిపి మహిళ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు గా సిరికొండ లక్ష్మీ.

Published: Thursday October 20, 2022

జన్నారం, అక్టోబర్ 18, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రానికి చెందిన సిరికొండ లక్ష్మిని మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా స్వర్గియా దివ్యంఘత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ  వైస్ షర్మిల బుధవారం నియామక పత్రాలను ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాపై నమ్మకంతో  రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా నియమించినందుకు ఆ పార్టీ అధ్యక్షురాలుకు  కృతజ్ఞతలు ఆమె తెలియజేశారు. మండలంలోని వైయస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతానికి ఆమె తగిన విధంగా నాయకులను కార్యకర్తలను పార్టీలోకి స్వాగతించడానికి తమ వంతు సహకారం చేస్తానని ఆమె తెలిపారు.