గ్రామానికి వైకుంఠ రథం చేతి కర్రలు పంపిణీ

Published: Monday November 08, 2021
యాదాద్రి నవంబర్ 7 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర క్రీస్తు శేషులు పైళ్ల బుచ్చి రెడ్డి గారి జ్ఞాపకార్థం అతని కుమారులు రమణారెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి లు గ్రామానికి సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో గ్రామానికి వైకుంఠ రథం మరియు వయోవృద్ధులకు 200 మందికి చేతికర్రలు, పండ్లను పంపిణీ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ గ్రామానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కా వెంకట్ రెడ్డి, ఎంపిటిసి బండారి ఎల్లయ్య, ఉప సర్పంచ్ ఫైళ్ల రవీందర్ రెడ్డి, దేవాలయ చైర్మన్ కోమటిరెడ్డి అనంత రెడ్డి, చేయూత ఫౌండేషన్ చైర్మన్ వాకిటి రామ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చింతల సురేందర్ రెడ్డి, ఎన్జీవో మండల కో ఆర్డినేటర్ ఫైళ్ల మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ కొలను మహేందర్ రెడ్డి, కళ్లెం సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి ఇంద్రా రెడ్డి, ఫైళ్ల గణపతి రెడ్డి, గ్రామ దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.