ఉప్పల్ డివిజన్లో రూ 72 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్

Published: Thursday December 01, 2022
మేడిపల్లి, నవంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ డివిజన్లోని సౌత్ స్వరూప్ నగర్లో  పలు అభివృద్ధి పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతీ సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మందముల రజితపరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
సౌత్ స్వరూప్ నగర్లో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మేల్యే రూ.72 లక్షల నిధులను మంజూరు చేయించారు.సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్
 మందముల రజితపరమేశ్వర్ రెడ్డితో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి భూమి పూజ చేశారు.వరద సమస్య ముప్పు నుంచి తప్పించేందుకు కాలనీలో నాలా వైపు ఫెన్సింగ్ ,రిటర్నింగ్ వాల్ ను సైతం నిర్మాణం చేయించనున్నట్టుగా ఈ సందర్భంగా ఎమ్మేల్యేేేే, కార్పొరేటర్ తెలిపారు. 
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, లేతాకుల రఘుపతి రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు వేముల సంతోష్ రెడ్డి, చింతల నరసింహారెడ్డి, పంగ మహేందర్ రెడ్డి, కృష్ణమాచారి, వేముల వెంకట్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు గజ్జల వెంకట్ రెడ్డి, తాటికొండ రమణ ,బాకారం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.