పత్తి కొనుగోలు దళారులపై చర్యలు తీసుకోవాలి ** డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి శ్యాంరావు, క
Published: Friday December 02, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 01ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలోని వాంకిడి మండలంలో పత్తి కొనుగోలు చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి బోర్కుటే శ్యామ్ రావు, గోడిసెల కార్తీక్ లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం వాంకిడి తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శి మాట్లాడుతూ వాంకిడి మండలంలో కొంతమంది దళారులు ఎలాంటి అనుమతులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్నారని అన్నారు. తూకంలో అవకతవకలకు అల్పడుతూ అమాయక రైతులని మోసం చేస్తున్నారని అన్నారు.మండల గ్రామాలలో అనుమతులు లేకుండా పత్తి కాంటాలను ఏర్పాటు చేసిన దళారులపై చర్యలు తీసుకొని, రైతులకు న్యాయం చేయాలని కోరారు.
Share this on your social network: