ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవిని భారీ మెజారిటీతో గెలిపించాలి

Published: Thursday March 04, 2021

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా మార్చ్ 03 ( ప్రజాపాలన ప్రతినిధి ) : టిఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు. బుధవారం మున్సిపల్ పరిధిలో గల పలు వార్డులలోని శివారెడ్డిపేట్ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ మైనారిటీ బాలికల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. అనంతరం రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధారూర్ మండలానికి చెందిన ఎబ్బనూరు పాండును మహావీర్ ఆసుపత్రిలో పరామర్శించారు. కొండా బాలకృష్ణా రెడ్డి గార్డెన్ ముందు యాక్సిడెంట్ జరిగిన వ్యక్తికి నాడి పరీక్ష చేసి, సిపిఆర్ (చాతి పై వత్తటం) నిర్వహించగా నాడి యధావిధిగా కొట్టుకోవడం ప్రారంభమయ్యింది. వెంటనే ఆటోలో హాస్పిటల్ కు తరలించారు. మహావీర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ధారూర్ మండలం ఎబ్బనూర్ గ్రామానికి చెందిన పాండును జిల్లా ఇంఛార్జి జహంగీర్ పాష, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్ లతో కలిసి పరామర్శించారు. స్వయంగా వైద్యులైన ఎమ్మెల్యే పాండు ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని చెప్పారు. అనంతరం హాస్పిటల్ డాక్టర్ లతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్ళపల్లి రమేష్ కుమార్ లు పాల్గొన్నారు.