23వ వార్డు అభివృద్ధే లక్ష్యం ప్రత్యేక అధికారి మహేందర్ గౌడ్
వికారాబాద్ బ్యూరో జూన్ 16 ప్రజాపాలన : 23వ వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని ప్రత్యేక అధికారి మహేందర్ గౌడ్ అన్నారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 4వ విడత పట్టణ ప్రగతిలో భాగంగా 23వ వార్డులోని అంతర్గత రోడ్లకు ఇరువైపులా పెద్దగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించామని పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనులలో భాగంగా మురికి కాలువలను శుభ్రం చేసి మురికి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించామని స్పష్టం చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నరసింహులు, నాయక్, రవి, మంగ్లీ బాయ్ లు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం వరకు నిరంతరంగా పనులు చేస్తున్నారని చెప్పారు. వార్డులో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలు నా దృష్టికి తెస్తే అక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నామని వివరించారు. మున్సిపల్ కమిషనర్ అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆర్థిక పరమైన సమస్యలను కాకుండా అక్కడికక్కడే పరిష్కారమయ్యే సమస్యలను ముందుగా పరిష్కరిస్తామని వెల్లడించారు.
Share this on your social network: