దాచేపల్లి ఫణి కుమార్ ఆర్థికసహకారంతో భక్తులకు అన్న ప్రసాదం

Published: Thursday March 03, 2022
మధిర మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు స్థానిక మెయిన్ రోడ్డు నందు శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం ముందుగా పూజలు చేసి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు మహా అన్నదాన కార్యక్రమాన్ని "మహా శివరాత్రి మహోత్సవాల" రెండో రోజు విచ్చేస్తున్న భక్తులకు మండల ఆర్యవైశ్య అధ్యక్షులు శ్రీ దాచేపల్లి ముత్యాలు కుమారుడు ఫణి కుమార్, సునీత, సుస్మిత, వైష్ణవ్ రాజ్, USA, కుటుంబ ఆర్థిక సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా దాచేపల్లి ముత్యాలు మాట్లాడుతూ ఈ మహాశివరాత్రి సందర్భంగా విచ్చేస్తున్న భక్తులకు "అన్నప్రసాద వితరణ" నా చేత చేయించడం భక్తులందరికీ ఆ ఈశ్వరుడు దీవెనలు ఉండాలని ఈ అన్నదానం చేయడం వల్ల ఆ ఈశ్వరుడు దీవెనలుఉంటాయని వారు తెలిపారు ఆ విధాత నాకు కల్పించిన ఈ సదవకాశం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేశారని దాతలు తెలిపారు ఈ సేవా కార్యక్రమంలో పెద్దలు ఇరుకుళ్ళ లక్ష్మీ నరసింహారావు, పల్లపోతు ప్రసాదరావు, వనమా సూరి, దాచేపల్లి మురళీకృష్ణ, కోమటిడి శ్రీనివాసరావు, మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు చారుగుండ్ల లక్ష్మీ నరసింహ మూర్తి, మహంకాళి వెంకట శ్రీనివాసరావు, కపిలవాయి జగన్ మోహన్ రావు కొప్పురావూరి రాము యోగేశ్వరరావు వేములపల్లి మల్లికార్జునరావు, జంగా శ్రీనివాస్ రెడ్డి, దోసపాటి వెంకట నాగ సోమేశ్వర రావు, దొడ్డ శ్రీనివాసరావు, నంబూరి రాము, నంబూరి మురళి, జల్లా రాధాకృష్ణ  పాల్గొన్నారు