ఘనంగా అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి

Published: Thursday January 13, 2022

మున్సిపల్ చైర్పర్సన్ డా. బోగ. శ్రావణి నివాళులు

జగిత్యాల, జనవరి, 11 (ప్రజాపాలన ప్రతినిధి): అక్షర సూర్యుడు స్వర్గీయ అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా స్థానిక అంగడి బజారులో వారి విగ్రహనికి వారి భార్య భాగ్యం, కుమారుడు సంగ్రామ్ తో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ డా.బోగ. శ్రావణి ప్రవీణ్ నివాళులు అర్పించినారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్పర్సన్ అలిశెట్టి ప్రభాకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి ఖ్యాతి గురించి కొనియాడారు. వారి కవిత్వాలు సమాజానికి అదర్శనియమని, కవిగా, చిత్రకారుడిగా, ఫోటోగ్రాఫర్ గా చివరకంటూ సమాజం కోసమే తండ్లాడిన ప్రజాకళాకారుడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్థంతి ఒకటే రోజు కావడం యాదృచ్చికమే అయినా, మరణం నా చివరి చరణం కాదు అని ఆయన చేసిన ధీరోదాత్త ప్రకటన ప్రతీ లక్ష్యసాధకుడికి స్ఫూర్తి నింపాలి, అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ ఛైర్మన్ జి.ఆర్ దేశాయ్, కౌన్సిలర్లు మేక పద్మావతి పవన్, అడువాల జ్యోతి లక్ష్మణ్, క్యాదాసు నవీన్, మూసకు నారాయణ రెడ్డి, అల్లే గంగాసాగర్, పాంబాల రాము, బోడ్ల జగదీష్, ముస్కు నారాయణ రెడ్డి, తెరాస నాయకులు, పద్మశాలి సంఘ సబ్యులు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సబ్యులు, తదితరులు పాల్గొన్నారు.