సిసి రోడ్డుకు శంకుస్థాపన
Published: Saturday April 01, 2023
మధిర, మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి:మధిర నియోజకవర్గ శాసనసభ్యులు శాసనసభాపక్ష నేత గౌరవనీయులైన మల్లు భట్టి విక్రమార్క కృషితో మంజూరైన 4 లక్షల రూపాయలు నిధులతో నక్కలగరువు (బుచ్చిరెడ్డి పాలెం) గ్రామంలో సంపసాల రామకృష్ణ ఇంటి వద్ద నుండి సంపసాల వెంకటేశ్వరరావు ఇంటి వరకు 90 మీటర్ల సిసి రోడ్డుకు శుక్రవారం మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంశెట్టి కిషోర్* కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునగా వెంకటరావమ్మ, సెక్రటరీ హేమలత, వార్డు నెంబర్ సం పసాల రామకృష్ణ, మండల కాంగ్రెస్ నాయకులు కర్నాటి రామారావు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు చిలువేరు బుచ్చి రామయ్య, గ్రామ కాంగ్రెస్ నాయకులు సంపసాల రామకృష్ణ, దేవి శెట్టి సురేష్, దేవిశెట్టి అంజయ్య, దేవి శెట్టి మల్లయ్య, సంపసాల పుల్లయ్య, సంపసాల వెంకటేశ్వర్లు, పసుపులేటి నరసింహారావు, ముత్తయ్య, సంపసాల కాటంరాజు మొదలగువారు పాల్గొన్నారు.
Share this on your social network: