సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్ల వినతి

Published: Wednesday May 26, 2021

జన్నారం, మే25, ప్రజాపాలన : తమ సమస్యలు పరిష్కరించాలని టిఆర్ఎస్ కెవి ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయంలోని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. గ్రామాలలో కరోనా నియంత్రణకు ఆశా వర్కర్లు కృషి చేస్తున్నారని వారన్నారు. తమకు ఉద్యోగ భద్రత లేదని, ప్రభుత్వం ఇచ్చే కనీస వేతనం కూడా రావడం లేదని వారు వాపోయారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆశా వర్కర్లు కోరారు. ప్రభుత్వం అధికారులు స్పందించి ఆశా కార్యకర్తల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్కెవి ఆశా కార్యకర్తల సంఘం మంచిర్యాల అధ్యక్షులు కె.విజయ, ఆకుల వాణి, శోభ, పద్మ, సుబ్రమణి తదితరులు పాల్గొన్నారు