బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ - భోగ శ్రావణి

Published: Thursday July 22, 2021
జగిత్యాల, జులై 21 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని ముస్లిం సోదర సోదరీమణులకు జగిత్యాల బల్దియా మున్సిపల్ ఛైర్పర్సన్ డా: భోగ శ్రావణిప్రవీణ్ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ జరుపుకుంటారని తెలంగాణ రాష్ట్రం కూడ త్యాగాల ఫలితంగా ఏర్పడిందని అన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా మైనారిటీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  షాదిముబారక్ ప్రత్యేక గురుకులాలు ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని బక్రీద్ పండుగను ఆనందోత్సాహాల మధ్య కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని కోరుకొంటూ ముస్లిం సోదరులందరు సంతోషంగా ఉండాలని ఛైర్పర్సన్ శ్రావణి ఆకాంక్షించారు.