ఛాయిస్ క్యాబ్స్ సర్వేసెస్ లోగో ఆవిష్కరణ

Published: Monday July 05, 2021
అమీర్ పేట్ జోన్ (ప్రజాపాలన ప్రతినిధి) : డ్రైవర్లు, వినియోగదారులు ఎదుర్కొంటున్నా సమస్యల పరిష్కారానికి  ఛాయిస్ క్యాబ్స్ సర్వేసెస్ ను హైదరాబాద్ నగర మార్కేట్ లోకి విడుదల చేస్తున్నట్లు ఛాయిస్ క్యాబ్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ లు సత్యనారాయణ, రసమల్ల, నిలేష్ లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన లోగో ను విడుదల చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ... గత కొన్ని సంవత్సరాలుగా ఇతర క్యాబ్ సర్వీసెస్ సంస్థలు అనుసరిస్తున్న విధానాల వల్ల క్యాబ్ డ్రైవర్లు, వినియోగదారులు ఎదుర్కొంటున్నా సమస్యలను పరిగణనలోకి తీసుకుని డ్రైవర్ల మీద మానసిక ఒత్తిడి పెరగకుండా వినియోగదారులు డ్రైవర్ కు ఇచ్చే రేటింగ్ విభాగానికి సంబంధం లేకుండా 0% కమిషన్ తో ఈ సర్వీసు ను తీసుకు రావడం జరిగింది అని తెలిపారు. తమ కంపనీ డ్రైవర్లు అందరూ 15 సంవత్సరాల అనుభవం కలవరని తెలిపారు. డ్రైవర్లు కేవలం ఛాయిస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయితే చాలు అని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ కు నెలకు ఒకసారి రిజిస్ట్రేషన్ చార్జెస్ ఉంటాయని తెలిపారు. ఎటువంటి సమయంలోనూ అదనపు చార్జీలు లేకుండా వినియోగదారుల భద్రత, నమ్మకమే తమ లక్ష్యంగా ఈ సర్వీసెస్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం www.chois.in వెబ్ సైట్ ను సంప్రదించవలసిందిగా కోరారు.