రీడ్ పౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ

Published: Monday April 25, 2022
బోనకల్, ఏప్రిల్ 24 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి ఉన్నంత పాఠశాలలో పేద విద్యార్థులకు రీడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రీడ్ ఫౌండేషన్ ఫౌండర్స్ లావుడ్యా రవికుమార్ చౌహన్ మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువుకునే ఆకాంక్ష ఉండాలి కానీ, రీడ్ ఫౌండేషన్ వారి కలలకు సహకారం చేస్తుందని అన్నారు .మంచి సంకల్పంతో పట్టుదలతో చదివి మంచి పేరు తెచ్చుకోవాలని పేద విద్యార్థుల పట్ల రీడ్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భూక్య బాలు, లావుడ్యా రవికుమార్ చౌహాన్, భుక్యా కిషన్, బోడ గన్న,రమేష్, భూక్యా రవిరాజ్, బానోత్ సరిలాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి కిరణ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రంజాన్ ఆలీ, రామకృష్ణారావు, పుల్లారావు, మురళి, శశి కుమార్, అన్నపూర్ణాదేవి, రవీందర్, మూడ్ గాంధీ, గుగులోత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.