యువత, విద్యార్థులు పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలి

Published: Thursday October 14, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 13, ప్రజాపాలన ప్రతినిధి : నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షులుగా నిట్టు జగదీశ్వర్ నియమితులైన సందర్భంగా  నియోజకవర్గ నూతన కమిటీ సభ్యులు, టిఆర్ఎస్వి మండల మున్సిపాలిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుతో కలిసి బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెరాస రాష్ట్ర యువ నేత శ్రీ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ)ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నూతన  టిఆర్ఎస్వి కమిటీ సభ్యులు పలు విద్యార్థి సంఘాల నేతలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ బలోపేతంలో యువకులు, విద్యార్థులు మరింత కృషి చేయాలని, రాజకీయాల్లో  యువకులదే కీలకపాత్ర కాబట్టి నూతనంగా ఎన్నుకోబడిన టిఆర్ఎస్వి కమిటీ సభ్యులందరూ గ్రామాలలో మరింత పనిచేయాలని పార్టీ అభివృద్ధి తో పాటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన  తెలిపారు. ప్రతి గ్రామాలలో టిఆర్ఎస్వి, యువత కమిటీ పూర్తిచేసి గ్రామాలలో యువ నాయకత్వాన్ని బలపరచాలని వారు తెలిపారు. నూతనంగా ఎన్నుకోబడిన టిఆర్ఎస్వి నియోజకవర్గ మండల కమిటీ సభ్యులును ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువత అధ్యక్షులు జెర్కొని రాజు, తెరాస పార్టీ మండల మున్సిపాలిటీల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిలకల బుగ్గ రాములు, అల్వాల వెంకట్ రెడ్డి, మడుపు వేణు గోపాల్, గంగిరెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి, పచ్చ భాష, ఎంపీటీసీల ఫోరమ్ ఏనుగు భారత్ రెడ్డి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మైలారం విజయ్ కుమార్, టిఆర్ఎస్వి ఆయా మండల అధ్యక్షులు ఆంబోత్ ప్రవీణ్ నాయక్, బన్నే శ్రీశైలం, నియోజకవర్గ టిఆర్ఎస్వి ఉపాధ్యక్షుడు బంగారు శశి, నర్సి గల ప్రవీణ్, అధికార ప్రతినిధి అచ్చన శ్రీకాంత్, రాఘవేంద్ర గౌడ్, దొండ మనీష్ రెడ్డి, నిమ్మల ప్రసాద్ గౌడ్, భగీరథ సాగర్, ఆవుల ప్రశాంత్ యాదవ్, ఏనుగు కార్తీక్ రెడ్డి, విజయ్ నాయక్, కొత్త ప్రదీప్ గౌడ్, గణేష్ చారి, దొండ శివారెడ్డి, కొత్తపల్లి సాయి గౌడ్, విక్రమ్, దానయ్య, కంద జైపాల్ రెడ్డి, లింగ రాజు, శ్రీనాథ్, శ్రీకాంత్, కాంగుల మహేష్, నాని గౌడ్, అమంచ రంజిత్, జెలమోని సతీష్ ముదిరాజ్, అక్బర్, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.