విద్యార్థులకు సొంత ఖర్చులతో స్టడీ మెటీరియల్ పంపిణీ** ఉపాధ్యాయుడు ధర్మపురి వెంకటేశ్వర్లు

Published: Friday February 10, 2023

ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 9 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని జనకాపూర్ జెడ్పి ఉన్నత పాఠశాలలొ ఆంగ్ల ఉపాధ్యాయులు ధర్మపురి వెంకటేశ్వర్లు విద్యార్థుల పట్ల ఉదారత్వం ప్రకటించారు. ఏప్రిల్ 3 నుండి 10వ తరగతి తుది పరీక్షలు ప్రారంభం రానున్న నేపథ్యంలో వారు ఉత్తమ జిపిఏ సాధించేందుకు 52 మంది విద్యార్థులకు తన సొంత ఖర్చులతో ఆంగ్ల విషయ స్టడీ మెటీరియల్ ను, ప్రధానోపాధ్యాయులు సుభాష్ బాబు, చేతుల మీదుగా గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెచ్ఎం సుభాష్ బాబు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, విధుల పట్ల అంకిత భావం అభినందనీయం అన్నారు. ఈ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు ప్రబోద్ కుమార్, లక్ష్మయ్య లు పాల్గొన్నారు.