దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు సిఎంఆర్ఎఫ్ ఆశా దీపం

Published: Wednesday June 23, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్, జూన్ 22, ప్రజాపాలన బ్యూరో : దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆశాదీపంగా వెలుగొందుతున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మోమిన్ పేట్ మండల పరిధిలోని చీమలదరి గ్రామానికి చెందిన పెద్దరామయ్యోల్ల చంద్రయ్య కుమారుడు మహేందర్ కరోనా బాధితునికి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాసన్ పల్లి నర్సింహారెడ్డి, మండల పార్టీ నాయకుడు వెంకట్ ఆధ్వర్యంలో సిఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపత్కాలంలో ఆదుకునేంందుకు సిఎంఆర్ఎఫ్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని గుర్తు చేశారు. నాణ్యమైన వైద్య చికిత్స అందించేందుకు ఈ డబ్బును వినియోగించాలని హితవు పలికారు. మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చీమలదరి గ్రామంలో ఏ సమస్య వచ్చినా వెంటనే నా దృష్టికి తేవాలని కోరారు. ప్రజల కష్టసుఖాలలో భాగస్వామి కావడమే నా లక్ష్యం అన్నారు.