స్మశానవాటికలో ఎల్ఐసి సహకారంతో చేతిపంపు ప్రారంభోత్సవం
Published: Tuesday May 31, 2022
బోనకల్, మే 30 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామపంచాయతీ ఎస్సి స్మశానవాటికలో ఎల్ఐసి వారి సహకారంతో, సుమారు యాభై వేల రూపాయల ఖర్చుతో చేతిపంపు ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాల నుండి కాలనీవాసులు స్మశాన వాటిక లోని నీళ్ల కోసం ఇబ్బంది పడుతూ ఉంటే ఎల్ఐసి వారు గమనించి స్మశాన వాటిక లోని బోరును మంజూరు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుడ్డురీ ఉమా, పంచాయతీ సెక్రెటరీ శివుడు, ఫాదర్ ప్రేమ్ కుమార్, పాస్టర్ రాజు, గ్రామ పెద్దలు రాధాకృష్ణ, వెంకట నరసయ్య, సురేష్ , వెంకటేశ్వర్లు, సీత రాములు, బ్రహ్మం, కాలనీ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: