సంతాజీ జగన్నాడే మహారాజ్ 398 వ జయంతి **
Published: Friday December 09, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 8
(ప్రజాపాలన,ప్రతినిధి):జిల్లా కేంద్రంలో శ్రీ సంతాజీ జగన్నాడే మహారాజ్ 398 వ జయంతి వేడుకలను గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పిటిసి నాగేశ్వర్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ (ఏఎంసీ), పాల్గొని సంత్ శిరోమణి శ్రీ సంతాజీ జగన్నాడే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహారాజ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహారాజ్ నారాయణస్వామి, వాంకిడి ఎంపీపీ విమలబాయి, జడ్పీటీసీ అజయ్ కుమార్, సింగిల్విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి పటేల్, కేశవ్ రావు, పెంటూ, జయరాం, హీవురే సందీప్, వివిధ సంఘాల నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network: