గాంధీనగర్ గణేష్ యూత్ టోర్నమెంట్ క్రికెట్ ను ప్రారంభించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్

Published: Saturday December 24, 2022

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం గాంధీనగర్ ఏరియాలో గణేష్ లయన్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు  ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. తొలిత క్రీడాకారులను పరిచయం చేసుకొని బ్యాటింగ్ చేసి క్రీడాకారులలో ఉత్సాహం నింపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుడ్యానికి దోహదపడుతున్నాయన్నారు. నేటితరం యువత విద్యతోపాటు క్రీడా రంగాలలో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అవరోధించాలని, తల్లిదండ్రులకు ఉన్న ఊరికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత, పి ఎస్ సి ఎస్ చైర్మన్ బిక్షాని శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మండల ప్రెసిడెంట్ గోపిరెడ్డి రమణారెడ్డి, సారపాక టౌన్ ప్రెసిడెంట్ శ్రీను, పూర్ణ ,ఏసోబు, చైతన్య రెడ్డి ,కృష్ణ, మూడుమని ,సురేష్ ,రాంబాబు ,బాలాజీ ,శివ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.