ఈటల రాజేంద్ర దిష్టిబొమ్మ దగ్ధం

Published: Friday July 30, 2021
మధిర, జులై 29, ప్రజాపాలన ప్రతినిధి : బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి దళితులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గురువారం ఎస్సీ పట్టణ నాయకులు ఖమ్మంపాడు కిరణ్, నాయకులు మహాదేవపురం మాజీ సర్పంచ్ మొండెం వెంకన్న, ఇల్లూరు సర్పంచ్ కోట రామారావు, నిదానపురం గ్రామం టిఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకులు వెంపటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో  దళిత సంఘాలు, దళితులు పెద్దసంఖ్యలో పాల్గొని మధిర పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను  దగ్ధం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  దళితుల కుటుంబాలు అభివృద్ధి చెందడానికి దళితబంధు పధకాన్ని ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆశయాలను యావత్ దళిత సమాజం ఎంతో ఆనందంతో స్వాగతిస్తుంటే దళితులపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుమాలిన చర్య అని వారు అన్నారు.హుజూరాబాద్ నియోజకవర్గం లో దళితులను అవమానించినందుకు, వారికి ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి, ఈటల రాజేందర్ బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది  అన్నారు.గ్రామాలకు బిజెపి నాయకులు వస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ మాధురి, గద్దల నాని, బొల్లెడ్డు సుందర్రావు, జిల్లేపల్లి బాబురావు, గద్దల రోశయ్య, స్వామి, వేల్పుల శివ, రావూరి రాజా, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరావు, మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, రెండో వార్డు కౌన్సిలర్ సయ్యద్ ఇక్బాల్, పరిశ శ్రీనివాసరావు, గుగులోత క్రిష్ణ నాయక్, జేవీ రెడ్డి,బత్తుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.