రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు ఎక్సైజ్ కానిస్టేబుల్ పై దాడి.

Published: Saturday October 29, 2022

ఈరోజు ఉదయం గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తనకి నిర్వహించగా ఒక కారులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. అయితే ఆ కారు అక్కడి నుంచి తప్పించుకొని బూర్గంపాడు మండలం లక్ష్మీపురం మీదుగా వెళుతుంటే అక్కడ పట్టుబడుగా లక్ష్మీపురం వద్ద గంజాయి స్మగ్లర్లు ఎక్సైజ్ కానిస్టేబుల్ పై రాళ్లతో దాడిని చేశారు. ఈ దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ కి తీవ్రమైన గాయాలయ్యాయి. గంజాయితో వెళ్తున్న కారుని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహాయంతో పట్టుకోవడం జరిగినది.