అంబెడ్కర్ 130వ జయంతి వేడుకలు
మధిర ప్రజాపాలన ప్రతినిధి 14వ తేదీఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ గారి 130వ జయంతి ని భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారికీ నివాళులు అర్పించారు. నాయకులు చిలివేరు సాంబశివరావు మాట్లాడుతూ భారతదేశంలో సమసమాజ నిర్మాణానికి దిశగా రాజ్యాంగాన్ని రూపొంచారు. అదేవిదంగా అంటరానితనం, వివక్ష నిర్ములన జరగాలని పోరాడారు. అన్నివర్గాలకు న్యాయం జరిగేలా రాజ్యాంగ అధికారణలు రూపొందించరన్నారు. ఆ మహనీయుడును ప్రతి యువత స్పూర్తితో ముందుకు సాగాలని అన్నారు. ఈనాడు దేశం లో అయన స్పూర్తితో భారత ప్రధాని నరేంద్రమోడీ గారు దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారని అదిశగా ప్రపంచదేశాలు స్వాగతిస్తూ భారత సంస్కృతిని, సిద్ధాంతాలను మెచ్చుకుంటున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణరావు, బీజేపీ సీనియర్ నాయకులు రామిశెట్టి నాగేశ్వరావు, బీజేపీ టౌన్ ప్రధాన కార్యదర్శులు బియ్యవరపు రామకృష్ణ, పగడాల నాగేంద్రబాబు, సాయి, ఘఫుర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: