ఇల్లూరు గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Published: Wednesday May 11, 2022
మధిర మే 10 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో ఖమ్మంపాడు సహకార సంఘాలఆధ్వర్యంలో  ఇల్లూరు గ్రామంలో మంగళవారం నాడుదాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించింన మార్కెట్ కమిటీ చైర్మన్. చిత్తారు నాగేశ్వరరావుమండల పరిధిలోని ఇల్లూరు గ్రామంలో ఖమ్మంపాడు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ఇల్లూరు పరిసర ప్రాంత గ్రామ రైతులు పండించిన వరి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇల్లూరు గ్రామ సర్పంచ్ కోట రామారావు, సీఈఓ దొండపాటి వీరభద్రరావు, గ్రామశాఖ టిఆర్ఎస్ అధ్యక్షులు మెట్ల ప్రసాద్, దామ కిషోర్, దామా రఘు, దామ శేషగిరి,స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.