ఉపాధి హామీ కూలీలకు 600 రూ, వేతనం చెల్లించాలి
Published: Friday February 17, 2023
జన్నారం, ఫిబ్రవరి 16, ప్రజాపాలన: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రూ, 600 రోజువారి కనీస వేతనంగా చెల్లించాలని మహిళా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు పోతు విజయ శంకర్( సిపిఎం) కోరారు. గురువారం మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలు వలస పోకుండా ఉపాధి హామీ పనులను ప్రారంభించాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని 34 గ్రామాలలో గ్రామపంచాయతీ సర్పంచులు, ఫీల్డ్ అసిస్టెంట్లు నిరుపేదలకు ఉపాధి హామీ పని కల్పించి వారిని ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలలోని ప్రతి మండలాలలో ఉపాధి హామీ పథకం కూలి పని కల్పించి వారికి 600 రూ, వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు
Share this on your social network: