నర్సరీల నిర్వహణలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు

Published: Wednesday November 23, 2022
జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
వికారాబాద్ బ్యూరో 22 నవంబర్ ప్రజా పాలన : హరితహారంలో భాగంగా వికారాబాద్ పురపాలక సంఘం పరిధిలోని కడ్చర్ల గుట్టపై, ఫిల్టర్ బెడ్ వద్ద గల నర్సరీలను అలాగే ప్రశాంత్ నగర్ ( మహావీర్ ఆస్పత్రి ) వద్దగల పట్టణ ప్రకృతి వనాలను జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ఈరోజు పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే హరితహారంకు  అవసరమైన మొక్కలు అందించేందుకు నర్సరీలలో విరివిగా మొక్కలు పెంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నర్సరీల నిర్వహణలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, మున్సిపల్ రెవెన్యూ అధికారి శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.