కార్యకర్తలకు అండగా ఉంటా: దంత మాల కిషోర్ కుమార్

Published: Wednesday January 12, 2022
ఎర్రుపాలెం జనవరి 11 ప్రజా పాలన ప్రతినిధి: మంగళవారం నాడు ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో గత అక్టోబర్ నెలలో షర్మిలక్క నిరుద్యోగ నిరాహార దీక్షకు వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిన పాస్టర్ శ్యామ్ కుమార్ నీ వైయస్సార్ తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ దంతమల కిషోర్ కుమార్ (కే కే డి) మీనవోలు వచ్చి వాళ్ల కుటుంబాన్ని పరామర్శించి గతంలో 20 వేల రూపాయలు సహాయం చేయడం జరిగింది. అలాగే ఈ రోజు 100 కేజీలు బియ్యం, 10 కేజీలు కందిపప్పు, ఐదు కేజీలు పంచదార ఇచ్చి మరియు వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకోవటం జరిగింది. అలాగే వైయస్సార్ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముందుకొచ్చి ఆదుకుంటానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం మండల మైనార్టీ నాయకులు షేక్ ఇస్మాయిల్ మరియు రాజేష్ సురేష్ సోషల్ మీడియా సౌరీలు పాల్గొన్నారు.