50 లక్షలు ఎక్స్గ్రేషియా వెంటనే ఇవ్వాలి' మందకృష్ణ మాదిగ'

Published: Friday March 12, 2021

అశ్వరావుపేట ప్రజా పాలన ప్రతినిధి; అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామం నికి చెందిన అంగన్వాడి టీచర్ పద్దంనాగమణి కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వలన వికటించి మరణించిందని ఇది ముమ్మాటికీ నిజమని,వ్యాక్సిన్ వేసుకున్నప్పటినుండి జ్వరం వళ్ళు నొప్పులతో బాధ పడి చనిపోయిందన్నారు. అయితే ప్రభుత్వం ఫస్ట్ నుండి కూడా ఏమీ పట్టనట్టు నటిస్తూ, కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తుందనిఆయన అన్నారు. వెంటనే స్పందించి నాగమణి కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వో కార్యాలయం లోని తాసిల్దార్ కు వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏపూరి వెంకటేశ్వరరావు జిల్లా నాయకులు కోలేటి పకీరయ్య, మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు నార్ల పాటి సుబ్బారావు, గేలంకి అశోక్, నాగరాజు, శరత్ తదితరులు పాల్గొన్నారు.