కృష్ణాష్టమి సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాల యంలో

Published: Saturday August 20, 2022
పూజ లు ఎరుపాలెం ఆగస్టు 19 ప్రజాపాలన ప్రతినిధి ఏరుపాలెం మండలంజమలాపురం గ్రామం శుక్రవారం నాడు కృష్ణాష్టమి సందర్భంగాతెలంగాణ తిరుపతి గా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జమలాపురం నందు ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేవాలయంలోని గోశాలలో విరాజిల్లుతున్న శ్రీ కృష్ణ పరమాత్మునికి 21 కళాశాలతో శ్రీకృష్ణునికి పంచామృతాభిషేకం నిర్వహించి, తులసి మరియు పుష్పాల తోటి అలంకరించి స్వయంగా భక్తుల తోటి పూజా కార్యక్రమములు నిర్వహించడం జరిగినది. ఇట్టి పూజా కార్యక్రమము ముఖ్యఅర్చకులు ఉప్పల సుదర్శనశాస్త్రి, అర్చకులు ఉప్పల రాజీవ్ శర్మ,   ఆధ్వర్యంలో వేదపండితులు ఆర్ విజయ్ కృష్ణ, అనంతశైనా చార్యులు, సాయి అభిలాష్ వారి మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది.  పూజా కార్యక్రమం అనంతరం దేవాలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదములు వితరణ చేయడం జరిగింది.

 కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్ట్ ఉప్పల కృష్ణ మోహన్ శర్మ, ఆలయ పర్యవేక్షకులు బి. శ్రీనివాస్ జూనియర్ అసిస్టెంట్ డి.సోమయ్య అర్చకులు మరియు సిబ్బంది గ్రామస్తులు భక్తులు పాల్గొనడం జరిగింది.