ప్రేమ్ సాగరన్న అంబలి పంపిణి

Published: Wednesday May 18, 2022
మంచిర్యాల టౌన్, మే 17, ప్రజాపాలన : మంచిర్యాల మున్సిపాలిటీలోని  ఐబి చౌరస్తా,బస్టాండ్ ఏరియా, నస్పూర్ మున్సిపాలిటీలోని సీసీసీ కార్నర్, శ్రీరాంపూర్ బస్టాండ్ ఎదురుగా క్రీ.శే. కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అంబలి కేంద్రాలకు ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ - ప్రేమ్ సాగర్ రావు  హాజరై ఎండకు వచ్చే సామాన్య ప్రజల దాహార్తి తీర్చేందుకు  అంబలితో పాటు ఇంట్లో తయారు చేసిన మామిడికాయ పచ్చడి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.