కేసీఆర్ ను మార్చే రోజులు దగ్గర పడ్డాయి.

Published: Friday February 04, 2022
బిజెపి మండల అధ్యక్షుడు గోలి చందు
జన్నారం రూరల్, పిబ్రవరి 03 , ప్రజాపాలన: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యంగాన్ని మార్చలని అంబెడ్కర్ ను అగౌరపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ఐతే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మార్చేందుకు రోజులు దగ్గర పడ్డాయని బిజెపి మండల అధ్యక్షుడు గోలి చందు విమర్శించారు. గురువారం మండల కేంద్రం లో బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేసీఆర్ వాక్యాలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నల్లబ్యాడ్జీలు దరించి అంబెడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రదాన రహాదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబెడ్కర్ రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంగతి కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. కేసిఆర్ తన మాటను వెనక్కి తీసుకోవాలని, భారత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు ఎరుకల రమేష్ గౌడ్, వంగపల్లి సురేష్, పట్టణ అధ్యక్షులు రంగుల సూర్యం, మాజీ అధ్యక్షులు విరచారి, కట్ల నాగరాజు, కార్యాదర్శీ చిట్టిబాబు, ఎరుకల ఎల్లా గౌడ్ మండల యువ నాయకులు బెడద గోపాల్, అల్లం నాగరాజు, సందవేని పవన్ రాగం మురళి. తదితరులు పాల్గొన్నారు.