మధిర లో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Tuesday March 30, 2021

మధిర, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : మధిరలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ  వేడుకలను టిడిపి రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రామనాథం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ సెంటర్ నందిగామ సెంటర్, జీలుగు మాడు లలో పలు చోట్ల  జెండా పండుగ కార్య క్రమాలు, కేక్ కటింగ్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు నివాళులు సమర్పణ టీడీపీ పతాకాల ఆవిష్కరణలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసిరెడ్డి రామారావు మాట్లాడుతూ 40 సంవత్సరాల్లో పార్టీలో అనేక ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా అవతరించనుందని తెలుగువారి ఆత్మగౌరవం దశదిశలా వ్యాప్తి చేసిన వ్యక్తి అన్న నందమూరి తారకరామారావు గారని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చేకూరి శేఖర్ బాబు వీరమాచినేని శ్రీనివాసరావు మల్లాది హనుమంతరావు, మార్నిడ్ పుల్లారావు, జగన్, రంగయ్య, 1వ వార్డు కౌన్సిలర్ పగిడిపల్లి విజయమ్మ, 16వ వార్డ్ కౌన్సిలర్ వంకాయలపాటి బాబు, కాశీ, వేల్పుల కొండ, వర్మ, రామకోటి తదితరులు పాల్గొన్నారు