కెరెల్లి గ్రామ అభివృద్ధి పరిశీలన

Published: Thursday December 22, 2022

డిపిఓ తరుణ్ కుమార్

వికారాబాద్ బ్యూరో 21 డిసెంబర్ ప్రజా పాలన : హరితహారం పారిశుద్ధం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ అన్నారు. బుధవారం ధారూర్ మండల పరిధిలోని కెరెల్లి గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, ఎంపీవో గ్రామ సర్పంచ్ కొత్తకాపు నరసింహ రెడ్డి పంచాయతీ కార్యదర్శి రేవణ్ కుమార్ గౌడ్ తో కలిసి పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పనులు, రికార్డులు, పారిశుద్ధ్యం, పల్లె ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్లు పరిశీలించి సంబంధిత కార్యదర్శి రేవణ్ కుమార్ గౌడ్ కు
 తగు సూచనలు చేశారు. హరితహారం మొక్కలను పరిశీలించి ఖాళీగా ఉన్న స్థలాలలో మళ్లీ మొక్కలు పెట్టాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడాలని స్పష్టం చేశారు. పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు.