గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి
Published: Wednesday October 19, 2022
జిఆర్ పి ఎస్ఐ శేఖర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 18 అక్టోబర్ ప్రజా పాలన : గుర్తు తెలియని వ్యక్తి గుర్తు తెలియని రైలు బండి కింద పడి మృతి చెందాడని జిఆర్ పి ఎస్ఐ శేఖర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 అక్టోబర్ 18 మంగళవారం ఉదయం గుర్తు తెలియని మగ మనిషి వికారాబాద్- గోధంగూడ రైల్వే స్టేషన్ల మద్యన కి.మీ.నంబర్ 110/01-03( వికారబాద్ దగ్గర్లో) గుర్తు తెలియని రైలు బండి క్రిందపడి చనిపోయినాడు. సంఘటన స్థలంలో మృతుని చిరునామాకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుని యొక్క వయస్సు సుమారుగా 40 నుండి 45 సంవత్సరాలు ఉండవచ్చు. చనిపోయిన వ్యక్తి ఛామన ఛాయ కలిగి ఉన్నాడు. నలుపు రంగు తల వెంట్రుకలు, కొద్దిగా నలుపు తెలుపు కలిగిన గడ్డం కలదు.
చనిపోయిన వ్యక్తి తెలుపు రంగు ఫుల్ షర్ట్, నలుపు రంగు ప్యాంట్, తెలుపు రంగు హాఫ్ బనియన్, గోధుమ రంగు డ్రాయర్, ధరించి ఉన్నాడు. మృతుని యొక్క మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి నందు భద్రపరచడం జరిగినది. ఇట్టి సంఘటన ను అనుసరించి సిఆర్ నంబర్ 115/2022 నమోదు చేసి యు/సెక్షన్ 174 సిఆర్.పిసి ప్రకారం దర్యాప్తు చేపట్టడం జరిగింది. మృతునికి సంబంధించి అతని యొక్క సమాచారం/ఆచూకీ తెలిసిన యెడల, స్టేషన్ హౌస్ ఆఫీసర్, రైల్వే పోలీసు స్టేషన్, వికారాబాద్ కు సమాచారం అందించగలరు. మొబైల్ నంబర్ 9440627527.
Share this on your social network: