పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు
Published: Wednesday June 15, 2022
మేడిపల్లి, జూన్14 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్లో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు అధికారులకు సూచించారు.10వ రోజు
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా డివిజన్లోని శారద నగర్లో వివిధ సమస్యలపై కాలనీలలో పెండింగ్లో ఉన్న పనులపై అధికారులతో కలిసి కార్పొరేటర్ పర్యటించారు. శారద నగర్ లో సిల్ట్ మట్టి, డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్యలపై కార్పొరేటర్ అధికారులకు వివరించి త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి వెంకటరమణ,డిఈ చందన, వాటర్ డిపార్ట్మెంట్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి, మరియు కాలనీవాసులు అమ్మన వెంకటరెడ్డి,మధు, బిజెపి నాయకులు ముత్తినేని జగదీష్, పడిగే నాగేష్, పరి శ్రీనివాస్, ఓంకార్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: