ఎంబీబీఎస్ సీటు సాధించిన" నితిన్ను" అభినందించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

Published: Thursday November 10, 2022
బెల్లంపల్లి నవంబర్ 9 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గంలోని మారుమూల వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామానికి చెందిన దెబ్బటి నితిన్ నీట్ లో ర్యాంక్ సాధించి ఇటీవల రామగుండంలో ఏర్పాటుచేసిన మెడికల్ కళాశాలలో  ఎంబిబిఎస్ సీట్ పొందిన సందర్భంగా బుధవారం నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను ఘనంగా శాలువాతో సన్మానించి, అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మారుమూల మండలాల్లో సైతం విద్యను అభివృద్ధి చెందేలా చేయటం వల్లనే పిల్లలు బాగా చదువుకొని ఉన్నత చదువులు చదువుతున్నారని, ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకొని పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు వేణు , నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు ...