ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 17ప్రజాపాలన ప్రతినిధి *రాయపోల్ గ్రామఅభివృద్ధికి 35 లక్షల నిధులు మంజ

Published: Friday November 18, 2022
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామాభివృద్ధికి 35 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆ గ్రామ సర్పంచ్ గంగిరెడ్డి బలవంత్ రెడ్డి అన్నారు.
కుమ్మరి సంఘానికి 8  లక్షలు, ముదిరాజ్ సంఘానికి 6 లక్షలు,
రజక సంఘానికి 6 లక్షలు, బిల్డింగ్ కు 15 లక్షల రూపాయల ప్రొసీడింగ్స్ ను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతుల మీదుగా గురువారం   గ్రామ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు తీసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో  సర్పంచ్ గంగిరెడ్డి బల్వంత్ రెడ్డి, ఎంపీటీసీ1శ్రీశైలం, ఎంపీటీసీ2 గంగిరెడ్డి జ్యోతి భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ బాలరాజు, టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు బుగ్గరాములు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఈశ్వర్,  గ్రామ పార్టీ   అధ్యక్షుడు బాలు గౌడ్, వార్డ్ మెంబర్లు,కో ఆప్షన్ నెంబర్లు, గ్రామ  ముదిరాజ్ సంఘం పెద్దలు, కుమ్మరి సంఘం పెద్దలు, రజక సంఘం పెద్దలు, గ్రామ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు   తదితరులు పాల్గొన్నారు.