సీఎం సహాయనిధి చెక్కలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే...

Published: Wednesday March 31, 2021
జగిత్యాల, మర్చి 30 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు మంజూరైన 5,70,000 ఐదు లక్షల డెబ్భై వేల రూపాయల విలువగల సీఎం సహాయనిది చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డా.సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అందుబాటులో లేకుండ ప్రైవేట్ ఆసుపత్రులలో ఖరీదైన వైద్యం చేయించుకుని ఆర్థికంగా నష్టపోయి సీఎం సహాయనిదికి దరకాస్తూ చేసుకోగా మంజూరైన  చెక్కులను అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడ మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యుల సంఖ్య కూడ పెంచామని త్వరలోనే పడకల సంఖ్య మరియు మాతా శిశు ఆసుపత్రిని కూడ ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గట్టు సతీష్ వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ గంగాసాగర్ మల్లేశం ఆనంద్ రావు ఏఎంసి డైరెక్టర్ బండారి విజయ్ కో-ఆప్షన్ రియాజ్ మామా కత్రోజ్ గిరి కౌన్సిలర్స్ తదితరులు  పాల్గొన్నారు.