నష్టపరిహార పంట పొలాలను పరిశీలించిన సీఈవో అప్పారావు

Published: Wednesday April 05, 2023

 బోనకల్, ఏప్రిల్ 4 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో పంటనష్ట పరిహార క్రాప్ బుక్ చేసిన పంటపొలాలను సి ఈ ఓ అప్పారావు మంగళవారం పరిశీలించారు. ఆళ్లపాడు గ్రామంలో పంటపొలాలను పరిశీలించి క్రాప్ బుక్ చేసుకున్న రైతు లతో క్రాప్ బుక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, మాజీ సర్పంచ్ పారా లక్ష్మినారాయణ, ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్, ఎం పి ఓ వ్యాకరణ సుబ్రహ్మణ్య శాస్తీ, పంచాయతీ కార్యదర్శి పరశురాం, రైతులు షేక్ జాని , షేక్ ఉద్దడ్డు సాహెబ్ అనుబోతు శ్రీను పాల్గొన్నారు.