నేటి నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయండి : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Monday December 20, 2021
బెల్లంపల్లి: డిసెంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బెల్లంపల్లి నియోజకవర్గంలో సోమవారం నాడు తలపెట్టిన కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, మరియు చావు డప్పు కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. సోమవారం నాడు ఉదయం 10 గంటలకు యోజకవర్గంలో ని తాండూరు మండల కేంద్రంలో మరియు బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో మధ్యాహ్నం 12 గంటలకు అలాగే కాశీ పేట మండల కేంద్రంలో ఒంటిగంటకు, కన్నెపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం రెండు గంటలకు,  నిరసన కార్యక్రమాలు జరుగుతాయని  ఆయా మండలాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డ్ సభ్యులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ లు డైరెక్టర్లు, మండల మరియు గ్రామ తెరాస పార్టీ నాయకులు, అనుబంధ కమిటీల అధ్యక్షులు, సభ్యులు, రైతులు, ప్రజలు, అందరూ సకాలంలో హాజరై ఈ కార్యక్రమాల్నీ విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే హాజరుకాలేని భీమిని, నెన్నెల, వేమనపల్లి, మండల కేంద్రాల్లో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన తెలిపారు.