టపాసులు అమ్మే దుకాణాల యజమానులు భధ్రతా ప్రమాణాలు పాటించాలి* *షాబాద్ సీఐ గురువయ్య గౌడ్*

Published: Tuesday October 25, 2022
చేవెళ్ల అక్టోబర్ 23 (ప్రజా పాలన)

*దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్  స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేనట్లయితే  చర్యలు తప్పవు. ప్రతీ దుకాణం ముందు ఇసుక బకెట్ లు, వాటర్ డ్రమ్ము, ఫైర్ సేఫ్టీ  సిలిండర్ పెట్టుకోవాలి.  దుకాణాలకు దుకాణాలకు మధ్య  దూరం పాటించాలి. అగ్ని ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు తమ ఇంటివద్ద తగిన జాగ్రత్తలు పాటిస్తూ టపాసులు కాల్చుకోవాలి, పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే టపాసులు కాల్చుకోగలరు. ప్రతి ఒక్కరు దీపావళి ని  ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి అని
ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు