దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు.. యేసుక్రీస్తు మార్గంలో నడవాలి..
Published: Monday August 01, 2022
టీసీసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ సుదర్శనం..
కల్లూరు, జులై 31 (ప్రజాపాలన న్యూస్):
సమాజంలో కొందరు దుష్టులు ఉంటారని, అటువంటి వారి మార్గాన నడవకుండా యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతిఒక్కరు నడవాలని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. డేవిడ్ సుదర్శనం అన్నారు. ఆదివారం కల్లూరులో జరిగిన ఆరాదనలో ఆయన ప్రసంగించారు. క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు సూచనలను అనుసరించిన వారే నిజమైన క్రైస్తవులన్నారు. ప్రజలు ఏమైనా తప్పులు చేస్తే వాటికి ఒప్పుకొని, ఇకనుంచి తప్పులు చేయకుండా యదార్థవంతమైన జీవితం గడపాలని సూచించారు. ఆస్తులు, అంతస్తులు లేకపోయినప్పటికీ యేసుక్రీస్తు మార్గాన నడిస్తే జీవితం సార్థకతమవుతుందన్నారు. తప్పుడు పనులు చేస్తే ఏదో ఒక రోజు శిక్ష అనుభవించక తప్పదన్నారు. మానవాళి మనుగడ కోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.
Share this on your social network: