ఘనంగా మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ శీలం సిద్ధారెడ్డి గారి జన్మదిన వేడుకలు

Published: Tuesday August 24, 2021
ఎర్రుపాలెం, ఆగష్టు 23, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు గ్రామంలో మాజీ మంత్రి స్వర్గీయ శీలం సిద్ధారెడ్డి  94వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ వారు ఈప్రాంతానికి చేసిన అభివృద్ధి గురుంచి మాట్లాడుతూ కట్లెరు ప్రాజెక్ట్, జూనియర్ కాలేజ్, హాస్పిటల్, రోడ్లు తదితర కార్యక్రమాలు చేశారని కొనియాడారు ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ అద్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బండారు నరసింహారావు, గ్రామ కాంగ్రెస్ అద్యక్షుడు యన్నం పిచ్చిరెడ్డి, రచయిత పుస్తకావిష్కర్త కుడుముల వెంకట్రామిరెడ్డి, నాయకులు శీలం ప్రతాపరెడ్డి, గోపాల్ రెడ్డి, శీలం కృష్ణారెడ్డి, దేవరకొండ శ్రీను, వేమిరెడ్డి రామిరెడ్డి, వి వెంకటరెడ్డి, పి వెంకటేశ్వర్లు, శీలం విద్యాలత సిద్ధారెడ్డి గారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు..