ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధి *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు
Published: Saturday April 15, 2023
ఇబ్రహీంపట్నం చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించిన బి.ఆర్.ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన జీవితాల్లో వెలుగు నింపాడని బాబాసాహెబ్ మార్గంలో అందరు పయనించాలని భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతలు పొందిన మహనీయుడని భారత రాజ్యాంగ నిర్మాతగా పేరుందిన మహానేత ఆయన రాజ్యాంగం రాసి ఇచ్చిన మహానుభావుడని ఎమ్మెల్యే ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు క్యామా మల్లేష్ యాదవ్ ఎంపీపీ కృపేష్.మున్సిపాలిటీ వైస్ చేర్మెన్ ఆకుల యాదగిరి కౌన్సిలర్ లు సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Share this on your social network: