తహశీల్దార్ శ్రీలతకు వినతి అందజేత..

Published: Thursday July 14, 2022
తల్లాడ, జులై 13 (ప్రజా పాలన న్యూస్):
అపరిస్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షులు  షేక్. అజీజ్ డిమాండ్ చేశారు. బుధవారం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్యాలతో కలిసి తల్లాడ తహశీల్దార్ గంటా శ్రీలతకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ వీఆర్వోలకు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా పే స్కేలును వెంటనే విడుదల చేయాలని, 55 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, వారికి పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జులై 21, 22 వరకు జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు, 23న కలెక్టరేట్ ముట్టడి, 25 నుండి సమ్మె చేపడుతామని తెలిపారు. వీఆర్ఏలు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ పాలనలో నిత్యం రెవిన్యూ సమస్యలు పరిష్కరిస్తున్నారని తక్షణమే ఆ సమస్యలను నెరవేర్చారని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏలు  తదితరులు పాల్గొన్నారు.