ఈరోజు ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పి.కృపేష్ అధ్యక్షతన సర్వసభ్య సమావ

Published: Tuesday July 05, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 4 ప్రజాపాలన ప్రతినిధి.

మండల ప్రజా పరిషత్ ఇబ్రహీంపట్నం సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ పి.కృపేష్  మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదేవిధంగా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశు పోషణ పశు సంవర్ధక శాఖ, గ్రామ పంచాయతీ మరియు గ్రామీణ అభివృద్ధి, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, సమగ్ర శిశు సంక్షేమ శాఖ,  వైద్యఆరోగ్యశాఖ, విద్యుత్ శాఖ, పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ,  స్నేహ మహిళ పరస్పర పొదుపు, మండల మహిళా సమైక్య, ఎక్సైజ్ శాఖ,సమీక్ష నిర్వహించి
గ్రామాలలో ఉండే రైతులకు పేద ప్రజలకు అందుబాటులో ఉండి  సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని  అధికారులను ఆదేశించారు,
అంతేకాకుండా MPP ఎంపీపీ, ఎంపీటీసీలు మూడు సంవత్సరాల పూర్తిచేసుకున్న శుభసందర్భంలో ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం  జరిగింది
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మంచిరెడ్డి ప్రతాపరెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు బూడిద రామ్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్ రెడ్డి, ఎంపీడీవో క్రాంతి కిరణ్,ఎమ్మార్వో రామ్మోహన్,
ఎంపీటీసీలు నాగమణి భాస్కర్, మంగరవీందర్,అరుణ, శ్రీశైలం, ఆంజనేయులు, కో ఆప్షన్ షరీఫ్, సర్పంచులు, మల్లీశ్వరి, శివరాల జ్యోతి, యాదగిరి, బల్వంత్ రెడ్డి, విలేజ్ సెక్రటరీలు మండల అధికారులు ప్రజా ప్రతినిధులు , పత్రికా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.