వ్యవసాయ సహకార సంఘం సహకారంతో రైతుకు ఆర్థిక సాయం అందజేసిన చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి

Published: Wednesday August 03, 2022

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని శేరిగూడ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం ఉండే విధంగా చూస్తుందని అదే మాదిరిగా శేరిగూడ గ్రామంలో రైతు మరణించినందున వారి కుటుంబానికి వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు రైతుబంధు రైతు భీమా లాంటి పథకాలు ప్రజలకు అందుబాటులో అందిస్తూ రైతు అకాల మరణం చెందితే వ్యవసాయ సహకార సంఘం నుండి 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అదేవిధంగా చూస్తుందని చైర్మన్ తెలిపారు. చేరిగూడ గ్రామవాసి రైతు వర్కాల పద్మమ్మ భర్త బిక్షపతి మరణించడంతో వారి కుటుంబానికి కొడుకు వర్కల వెంకటేష్ కు పాలకమండలి సహకారంతో 15 000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండల్ సభ్యులు ఎదుల్లా పాండురంగారెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మొద్దు & కారింగ్ శ్రీనివాస్ రెడ్డి, వర్గాల శ్రీరాములు సీఈవో బోస్ పల్లి గణేష్ గ్రామ పెద్దలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .